కణ్పుడు/కృష్ణుడు . శ్రీముఖుడి కుమారుడు 1వ శాతకర్ణి మైనర్ కావడం వల్ల ఇతని సోదరుడు కణ్పుడు లేదా కృష్ణుడు పాలకుడు అయ్యాడు.. శ్రీముఖుడి తరువాత అతని తమ్ముడు మొదటి కృష్ణుడు పరిపాలన చేశాడు., ఇతను 2వ శాతవాహన రాజు గా చెప్పుకోవచ్చు.
1st Kanhudu/ Krishnudu Satavahana Emporer - మొదటి కృష్ణుడు/ కణ్పుడు శాతవాహన రాజు
- శ్రీముఖుడి తరువాత అతని తమ్ముడు మొదటి కృష్ణుడు పరిపాలన చేశాడు., ఇతను 2వ శాతవాహన రాజు గా చెప్పుకోవచ్చు.
- ఇతడు కనేరి, నాసిక్ గుహలను తొలిపించాడు. నాసిక్ లో బౌద్ధ సన్యాసుల సంక్షేమం కొరకు ధర్మమహామాత్య అనే అధికారులను నియమించాడు. ఇతని కాలంలో భాగవత మతం దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించింది.
- భారతదేశంలో భాగవతమతంగా ఉన్నట్లు హెలియోడోరస్ బేస్ నగర్ శాసనం తెలియజేస్తున్నది. భాగవత మతం మగధ పాలకుడైన పుష్యమిత్ర శుంగుడి కాలంలో ఆవిర్భవించింది.
- భాగవత మత స్థాపకుడిగా శ్రీకృష్ణుడిని పరిగణిస్తారుశ్రీముఖుడి మరొక తమ్ముడు హుకు.. హుకుశ్రీని నానాఘాట్ శాసనంలో రాజకుమారుడిగా పేర్కొనబడ్డాడు.
- కర్నూలు జిల్లాలోని పిఠాపురంలో దొరికిన ఒక సీసపు బిళ్ళ మీద హుకుశ్రీ పేరు ఒక వైపు, రోమన్ చక్రవర్తి టైబీరియస్ బొమ్మ మరోవైపు ఉన్నాయి.
- ఇటీవల కోటిలింగాల దగ్గరి మొక్క ట్రాపుపేట గ్రామం వద్ద దొరికిన ఒక శాసనంలో హుకుశ్రీ మొదటి శాతకరి, నాగానికల కుమారుడుగా పేర్కొనబడ్డాడు.
0 Comments